ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఈ మధ్య భీమ్లా నాయక్ తో హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. గతంలో ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఖుషి, బంగారం వంటి చిత్రాలు వచ్చాయి. ఖుషి ఎవర్ గ్రీన్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బంగారం మాత్రం యావరేజ్ అనిపించుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అయినా కాంబో కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇది పీరియడిక్ డ్రామాగా రూపొందుతున్న సినిమా. ఔరంగజేబ్ కాలంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగాజేబ్ గా కనిపించబోతున్నాడు. కాగా, ఈ స